Pages

Monday, July 30, 2012

పనసపొట్టు కూర



కావలసిన పదార్థాలు: 

పనసపొట్టు - 2 కప్పులు, 
ఎండుమిర్చి -5, 
ఇంగువ - 2-3 చిటికెలు 
ఆవాలు - 2-3 టీ స్పూన్లు, 
అల్లం ముక్క - ఒక ఇంచ్ 
మినప్పప్పు - 2 టీ స్పూన్లు, 
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్లు, 
కరివేపాకు - 4 రెబ్బలు, 
చింతపండు రసం - 2-3 స్పూన్లు 
పసుపు - అర టీ స్పూను, 
ఉప్పు - రుచికి తగినంత, 
నూనె - 2 టేబుల్ స్పూన్లు 
చిట్టొడియాలు (మినప వడియాలు చిన్నవి)- 6-10 వరకు 

తయారుచేసే విధానం: 

పనసపొట్టుని మూడొంతులు నీరున్న పెద్ద పాత్రలో వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి. 
ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి. 

ఎండుమిరపకాయలను (3 లేక 4), ఆవాలను కాసేపు నీళ్ళల్లో నానపెట్టుకొని, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. 

తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేగాక ఉడికించిన పనసపొట్టుని కలపాలి. సన్నని సెగమీద నీరంతా ఇగిరిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకోవాలి. 
తరవాత ఆవముద్ద కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, మూత పెట్టుకోవాలి. తినే ముందు వేయించిన చిట్టొడియాలు కలుపుకొని తింటే బాగుంటుంది.( పోపు వేగినతరవాత కాస్త పోపు తీసుకొని తినేముందు కలుపుకొని తింటే కటకట పోపుతో కూర చాలా బాగుంటుంది. కొంత మంది పోపులో పళ్ళీలు కూడా వేసుకుంటారు.)

0 comments:

Post a Comment