Pages

Wednesday, August 1, 2012

జిలేబి

మైదా - 1 కప్ 
బియ్యప్పిండి - 3 స్పూన్స్ 
చెక్కర (బెల్లం కోరుకొన్నది) - 21/2 కప్ 
సోడ - చిటికెడు 
కేసర్ రంగు---చిటికెడు 
పుల్ల మజ్జిగ--1 కప్ 
నెయ్యి---2 కప్స్(వేయించడానికి) 

ఒక గిన్నెలోమైదా, బియ్యప్పిండి, సోడ, 
పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి. 
ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు చేసుకోవాలి) 

తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి. మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది. తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి. అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది.



తరువాత ఒక గిన్నెలో చెక్కర (బెల్లం) వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 
తరువాత వెడల్పాటి బానలి లో నెయ్యి వేసి, వేడి చేయాలి. తరువాత సాస్ బాటిల్లో తయారు చేసిన మైదా పిండిని వేయాలి.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి. 

ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి. 
ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి అర నిముషం పాటు ఉంచాలి. 
తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబికు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment