కావల్సినవి:
అరటిపువ్వు : ఒకటి
కంది పప్పు : ఒక కప్పు
శనగ పప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
ఆవాలు : చిటికెడు
కరివేపాకు : ఒక రబ్బ
పచ్చి మిర్చి : రెండు
ముందుగా అరటిపువ్వును వెన్నులు తీసుకొని సన్నగా తరుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పు ఎర్రగా వేయించుకొని అందులో నీరుపోసి బద్ద బద్దగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ శనగ పప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక అందులో పచిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇంగువ వేసుకొని అందులో ఈ అరటి పువ్వు తురుమును వేసి నీళ్ళ కంచము మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ( పోపు మెత్తబడకూడదనుకునే వారు పొపు తీసి పక్కన పెట్టుకొని చివర్లో కలుపుకోవచ్చు). అరటిపువ్వు ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పును వేసుకొని (కాస్త ఉప్పు కావలంటే వేసుకోవచ్చు)కలుపుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి దింపేసేయండి. అంతే అరటిపువ్వు పప్పు కూర తయ్యారు. అందులో చల్ల మెరపకాయాలు నచుకొని తింటే బాగుంటుంది.