Sunday, November 18, 2012
శనగల పాటోళీ
కావలసిన వస్తువులు
శనగలు -2 కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిర్చి-4- 6(కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని మిర్చి వేసుకోవచ్చు)
ఉల్లిపాయ - 2 పెద్దవి
ఎండు మిరపకాయలు - 2
శనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - ఒక కప్పు
తయారుచేసే విధానం:
ముందుగా శనగలు ఆరుగంటలు నానపెట్టుకోవాలి, నానిన శనగలతో పాటు ఒక చిన్న అల్లం ముక్క,పచ్చి మిరపకాయలు వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బాణలీలో కొంచెం నూనే వేసుకుని అందులో ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలపేస్ట్ ని వేసి సన్నటి సెగ మీద వుడికించుకోవాలి. మద్య మద్యలో కలుపుతూ బాణలీ అడుగున అంటుకోకుండా కొంచెం పొడిగా అయ్యేవరకు చూసుకోవాలి. అంతే, వేడి వేడి పాటోళీ రెడి, దీనికి మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్.
అలాగే శనగపప్పుతో కూడా చేశుకోవచ్చు. శనగపప్పు ఒక గంట నానితే చాలు.
Labels:
Curries
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment