కావలసినవి :
అరటిపువ్వు: లేతది
1సెనగ పిండి: 1 ½ కప్పుబియ్యం పిండి: అరకప్పు
కంటే కొద్దిగా తక్కువఉప్పు తగినంతపసుపు : ¼ స్పూన్
పచ్చిమిరపకాయలు :
5 (మీ కారానికి సరిపడేంత)అల్లం : 1 ఇంచ్ధనియాలు : 3/4
స్పూన్సౌంఫ్ : ½ స్పూన్ (optional)
జీలకర్ర : ¼ స్పూన్నూనె : పకోడీ
వేయించడానికి
విధానం :
అరటి పువ్వుని
మధ్యలో కాడలు (దొంగలు) తీసి నీళ్ళలో ఉప్పు వేసుకొని ఒకసారి కడిగి పక్కనపెట్టుకోండి. ఒక వెడల్పాటి గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి,
ఉప్పు, పసుపు వేసి కలుపుకోండి. అల్లం
పచ్చిమిరపకాయ మిక్సిలో వేసుకొని ముద్ద చేసుకొని అది పిండిలో కలుపుకోండి. అలానే ధనియాలు, సౌంఫ్, జీలకర్ర మరీ మెత్తగా
కాకుండా పొడి చేసుకోండి అది కూడా పిండిలో వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి
కడిగిపెట్టుకున్న అరటి పువ్వుని, 3స్పూనుల
వేడి నూనెని వేసుకొని కలపండి. ఇప్పుడు నీళ్ళు చిలకరిస్తూ జాగ్రత్తగా గట్టిగ ఉల్లిపాయ
పకోడికి మల్లె కలుపుకోండి. (ఈ పకోడీ మిశ్రమం కి ఎక్కువ నీరు పట్టదు).పెద్ద మూకుడులో
నూనె వేడి చేసుకొని చెయ్యి కొద్దిగా తడి చేసుకుంటు చిన్న చిన్న పకోడీలు వేసి
వేయించుకోండి.
Tip : సోయ కూరా నచ్చేవాళ్ళు ఒక కట్ట సన్నగా తరిగి ఈ పకోడీ
మిశ్రమంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది.
0 comments:
Post a Comment