కావలసినవి:
పనసపొట్టు : 250 gms మామిడికాయ : 1
కారం : 1 ½ స్పూన్ (మీరు ఎక్కువ కారం అలవాటు వుంటే ఎక్కువ వేసుకోవచ్చు)పసుపు:1/4 స్పూన్ఉప్పు : తగినంతమెంతిపొడి : ½ స్పూన్నునె : 5 స్పూన్స్
పోపుకి : ఆవాలు ½ స్పూన్, చిటికెడు
ఇంగువ, రెండు ఎండుమిరపకాయలు.
విధానం :
మామిడికాయ చెక్కు తీసి తురుముకోవాలి. ఒక పెనంలో 4 స్పూన్ల నూనె వేసి కొద్దిగా వెడిఎక్కిన
తరువాత మామిడి కోరు, పనపొట్టు వేసి కలిపి పైన మూత పెట్టి ఒక 3 నిమిషాల తరువాత పసుపు,
ఉప్పు వేసి కలిపండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకో 2 నిమిషాల తరువాత ఎండుమిరపపొడి
మరియు మెంతిపొడి వేసి కలిపి ఇంకో రెండు నిముషాలు వుంచి దించెయ్యండి. ఇప్పుడు ఒక చిన్న పోపు మూకుడులో ఒక స్పూన్ నునే
వేసి అందులో ఆవాలు, ఇంగువ మరియు రెండు ఎండుమిరపకాయలు వేసి, ఆవాలు చిటపటలాడగానే,
మామిడి పనస కోరులో వేసి కలుపుకోండి. ఇది
అన్నంలోకి, దోసలతో, చపాతీ లోకి కూడా బాగుంటుంది.
0 comments:
Post a Comment