Pages

Friday, November 30, 2012

అరటిపువ్వు పప్పు కూర



కావల్సినవి: 

అరటిపువ్వు : ఒకటి
కంది పప్పు : ఒక కప్పు
శనగ పప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
ఆవాలు : చిటికెడు
కరివేపాకు : ఒక రబ్బ
పచ్చి మిర్చి : రెండు 


ముందుగా అరటిపువ్వును వెన్నులు తీసుకొని సన్నగా తరుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పు ఎర్రగా వేయించుకొని అందులో నీరుపోసి బద్ద బద్దగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ శనగ పప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక అందులో పచిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇంగువ వేసుకొని అందులో ఈ అరటి పువ్వు తురుమును వేసి నీళ్ళ కంచము మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ( పోపు మెత్తబడకూడదనుకునే వారు పొపు తీసి పక్కన పెట్టుకొని చివర్లో కలుపుకోవచ్చు). అరటిపువ్వు ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పును వేసుకొని (కాస్త ఉప్పు కావలంటే వేసుకోవచ్చు)కలుపుకొని రెండు నిమిషాలు  స్టవ్ మీద ఉంచి దింపేసేయండి. అంతే అరటిపువ్వు పప్పు కూర తయ్యారు. అందులో చల్ల మెరపకాయాలు నచుకొని తింటే బాగుంటుంది.  

Sunday, November 18, 2012

చనా గోబీ ఫ్రై



కావల్సినవి: 

గోబి ముక్కలు : ఒక కప్పు 
కాబూలీ చన : ఒక కప్పు 
జీర : ఒక స్పూన్ 
పచ్చి మిర్చీలు : 3-4 
ఉల్లిపాయలు: 2-3 
కరివేపాకు : రెండు రబ్బలు 
జీర పొడి : ఒక స్పూన్ 
నిమ్మరసం : 2-3 స్పూన్లు 
కొత్తి మీరి తురుము : ఒక స్పూన్ 

విధానం :

ముందుగా కాబూలి చన ఆరు గంటలు పసుపు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. నానిన చన ఉడికించుకొని పక్కనపెట్టుకోండి. కాళీఫవర్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో జీర వేసుకొని అది వేగాక అందులో పచి మిర్చి, కరివేపాకు వేసుకొని అది కాస్త వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి వేగుతూ ఉండగా అందులొ చిటికెడు పసుపు వేసుకొని అది బాగా వేగాక అందులో ముందుగా ఉడికించుకొన్న చన, కాలీఫవర్ ముక్కలు వేసుకొని అందులో ఉప్పు, జీర పొడి వేసుకొని ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకొని పైన కొత్తిమీరి తురుము వేసుకొని కలుపుకోవాలి. అంతే గోబీ చన మసాల రెడీ.

శనగల పాటోళీ



కావలసిన వస్తువులు

శనగలు -2 కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిర్చి-4- 6(కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని మిర్చి వేసుకోవచ్చు)
ఉల్లిపాయ - 2 పెద్దవి
ఎండు మిరపకాయలు - 2
శనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - ఒక కప్పు

తయారుచేసే విధానం:

ముందుగా శనగలు ఆరుగంటలు నానపెట్టుకోవాలి, నానిన శనగలతో పాటు ఒక చిన్న అల్లం ముక్క,పచ్చి మిరపకాయలు వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బాణలీలో కొంచెం నూనే వేసుకుని అందులో ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలపేస్ట్ ని వేసి సన్నటి సెగ మీద వుడికించుకోవాలి. మద్య మద్యలో కలుపుతూ బాణలీ అడుగున అంటుకోకుండా కొంచెం పొడిగా అయ్యేవరకు చూసుకోవాలి. అంతే, వేడి వేడి పాటోళీ రెడి, దీనికి మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్.

అలాగే 
నగపప్పుతో కూడా చేశుకోవచ్చు. నగపప్పు ఒక గంట నానితే చాలు.

మెంతాకు పప్పు



కావాల్సినవి: 

మెంతాకు : 1 కట్ట 
ఉల్లిపాయ : 1 (మీడియం) 
కందిపప్పు : 1 కప్పు 
ఆవాలు, జీరకర్ర ,మెంతులు : పోపుకి కావాల్సినవి. 
కరవేపాకు : 1 రబ్బ 
చింతపండు రసం : 3- 5 చంచాలు 
వెల్లుల్లి రెబ్బలు : 4 
ఉప్పు : తగినంత. 

చేసే విధానము: 

ముందుగా పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి . 
ఒక గిన్నెలో కొద్దిగా నూనే వేసుకొని అందులో ఆవాలు, జీరకర్ర, మెంతులు వేసుకొని అవి వేగాక అందులో సన్నగా తరుకున్న ఉల్లిపాయలు వేయించుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు వెసుకొని వెగాక 
అందులో కరవేపాకు, పచ్చి మిర్చి వేసుకొని, కొద్దిగా పసుపు (చిటికెడు) వేసి తరువాత అందులో సన్నగా తరిగిన మెంతాకు వేసుకొని అది వేగాక ఉడికించుకొన్న పప్పు వేసి, కొద్దిగా చింతపండు రసం వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. 

ఇది అన్నము, రోటీలలో కూడా బాగుంటుంది.

ఆలు బఠానీ బోండాలు


కావలసినవి :

ఆలు : రెండు
బఠానీలు (పచ్చివి) : అర కప్పు ( సగం గుప్పెడు )
ఉల్లిపాయలు : 1 (మీడియం)
కొత్తిమీరి , పుదీన : 1-2 స్పూన్ల తురుము.
సెనగపిండి : 4 స్పూన్లు .
ఉప్పు : రుచికి
పచ్చిమిర్చి : 2 ( సన్నగా తరుకోండి)

నూనె: వేయించడానికి కావల్సినంత.

చేసే విధానం :

ముందుగా ఆలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో ఈ ఉడికించిన ఆలు ముద్ద చేసుకొని, అందులో సెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు,ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి, పుదీన, కొత్తిమీర, సెనగపిండి అన్నీ వెసుకొని గట్టిగా కలుపుకోవాలి.

ఆ పిండిని చిన్న చిన్నగా ఉండలు చేసుకొని సన్నటి నూనె సెగలో వేయించుకోవాలి. టమాటా సాస్ తో తింటే బావుంటాయి.

చిక్కుడు కాయ ఉల్లికారం



కావలసినవి : 

చిక్కుడు కాయలు : పావు కిలో 
ఉల్లిపాయలు : 2-3 పెద్దవి 
అల్లము, వెల్లుల్లి ముద్ద : ఒక స్పూన్ 
నూనె : చిన్న కప్పు 
జీరకర్ర : 1/2 టీస్పూన్ 
ఉప్పు: తగినంత 
ధనియాలు : 1/2 స్పూన్లు 
ఎండుకారం: అర స్పూన్ 
పసుపు :చిటికెడు 

చేసే విధానము : 

చిక్కుడు కాయలు చిన్న చిన్న ముక్కలు(ఒక ఇంచ్) గా చేసుకోవాలి. ఉల్లిపాయలు, ధనియాలు, జీరకర్ర, ఎండుమెరపకాయలు, వెల్లుల్లి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కాస్త నూనె వేసుకొని అందులో జీరకర్ర వేసి తరవాత కాస్త పసుపు వేసుకొని ఆ తరవాత అల్లము వెల్లుల్లి పేస్ట్ వేగాక ముందుగా చేసుకొని ఉంచుకున్న ఉల్లి ముద్ద వేసుకొని కాస్త వేగాక అందులో కాస్త ఉప్పు, ఇంకొంచం కారం వేసుకొని ఆ తరవాత చికుడు ముక్కలు వేసుకొని కాస్త నీరు పోసుకొని నీళ్ళ కంచం బాణలి మీద పెట్టుకొని సన్నని సన మీద ఉడికించుకోవాలి. ఒక పది నిమిషాల తరవాత ఘుమఘుమలాడే చిక్కుడు ఉల్లికారం రెడీ..

Wednesday, August 29, 2012

చింత చిగురు పప్పు




కావలసినవి :
చింత చిగురు : ఒక కప్పు
పెసర పప్పు : రెండు కప్పులు
పచ్చి మిర్చిలు : నాలుగు
ఆవాలు, జీరకర్ర, మెంతులు : ఒక స్పూన్ 
ఇంగువ : చిటికెడు
ఎండు మిరపకాయ : ఒకటి
కరివేపాకు : రెండు రబ్బలు
సన్నగా తరిగిన కొత్తిమీర  : ఒక స్పూన్ 

ముందుగా పెసరపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. తరవాత ఒక బాణలిలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీరకర్ర, మెంతులు, ఎండు మెరపకాయ  వేసి అవి చిటపట లాడాకా  అందులో  ఇంగువ, కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కాస్త నూనె వేసి అందులో చిటికెడు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకొన్న చింత చిగురు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఉప్పు వేసుకొని, ఉడికించిన పెసరపప్పు వేసుకొని కాస్త నీరు పోసుకొని ఇంకొంచం సేపు స్టవ్ మీద ఉంచుకొని చివరిగా వేయించి పెట్టుకొన్న పోపు కూడా కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ . 

Tuesday, August 28, 2012

మునగాకు పప్పు కూర

మునగాకు పప్పు కూర :

కావలసినవి

మునగాకు : నాలుగు  కప్పులు
కొబ్బరి తురుము : ఒక కప్పు 
కండి పప్పు : రెండు కప్పులు
 మినప పప్పు : ఒక స్పూన్
శెనగ పప్పు : ఒక స్పూన్
ఆవాలు : అర స్పూన్
మెంతులు : పావు స్పూన్
ఇంగువ : చిటికెడు 
పచ్చి మిర్చి : నాలుగు 
కరివేపాకు ; రెండు రాబ్బలు
ఉప్పు: రుచికి తగినంత 
ఎండు మిరపకాయలు : నాలుగు
నూనె : నాలుగు స్పూన్లు 

ముందుగా కందిపప్పు వేయించుకొని (మరీ ఎర్రగా కాకుండా ) మరీ మెత్తగా కాకుండా బద్ద బద్దగా    ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని అందులో సెనగపప్పు, మినప పప్పు, ఆవాలు, మెంతులు , మెరపకాయలు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. అందులో కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని ( రెండు స్పూన్లు) అందులో చిటికెడు పసుపు వేసి, మునగాకు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి (పైన నీళ్ళ కంచం పెట్టుకుంటే బాగా మెత్తబడుతుంది ఆకు) . ఆకు బాగా ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పు, పోపు వేసుకొని తగినంత ఉప్పువేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా అందులో కొబ్బరి తురుము వేసి ముతపెట్టుకొని ఒక నిముషము తరవాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 

ఈ కూరలోకి మాగయి  పెరుగు పచ్చడి, చల్ల మెరపకాయలు నంచుకొని తింటే బాగుంటుంది. 

Friday, August 10, 2012

ఓట్స్ వడలు



ఓట్స్ : 1 కప్పు 
సెనపప్పు: 1 కప్పు 
ఉల్లుపాయలు : 1 కప్పు( సన్నగా తరుముకున్నవి) 
పచ్చి మిర్చీలు : 2 - 5 
అల్లం : చిన్న ముక్క 
కొత్తిమీరి : 3 స్పూన్లు ( సన్నగా తరుకున్నవి ) 
నూనె: వేయించడానికి సరిపడ్డా 
ఉప్పు : తగినంత 
పుదీన తురుము : 1 స్పూన్ 

సెనగపప్పు మూడు గంటలు నానపెట్టుకొని రుబ్బుకోవాలి అందులో ఒక పది నిమిషాలు నానబెట్టిన ఓట్స్ మెత్తగా కలుపుకోవాలి. 

అందులో ఉల్లి ముక్కలు, కొత్తిమీరె, పుదీన తురుము, సన్నగా తరుకొన్న పచ్చిమిర్చీ, అల్లం వేసి (కొద్దిగా గట్టిగా)వడలు లా చేసుకొని నూనె లో వేయించుకొంటే వేడి వేడి ఓట్స్ వడలు తయ్యార్.

మొక్కజొన్న వడలు




మొక్కజొన్న గింజలు - 2 కప్పులు ( మొక్కజొన్న కండెల నుండి గింజలు తీసుకొన్నవి)
పచ్చిమిరపకాయలు - 2-4
కొత్తిమీర- 2 టి స్పూన్లు తురుము
కరివేపాకు- 2-4 రెబ్బలు
ఉల్లిపాయలు - 1/4 కప్పు సన్నగా తరుక్కున్నవి
ఉప్పు - రుచికి
నూనె - వేయించడానికి సరిపడ్డా

చేసే విధానం :

* మొక్కజొన్న గింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి.

వడల పిండిలానే గట్టిగా ( కొంచం) వుండేటట్లు చూసుకోవాలి, అందులో ఉల్లి చెక్కు వేసుకొని కలుపుకొని నూనేలో వేయించుకోవాలి. క్రిస్పి గా కావాలనుకొన్నవారు వడ వేసే ముందు బియ్యపిండిలో అద్దుకొని వేసుకోవచ్చు.

అంతే మొక్కజొన్న వడలు తయ్యరు, టమాట సాస్ తో , లేక పుదీన చెట్నితో తింటే బాగుంటాయి .

ఉసిరికాయ పెరుగు పచ్చడి



కావలసిన పదార్ధాలు: 

ఉసిరికాయలు - 
కొత్తిమిరి తురుము - 2 స్పూన్లు 
పచ్చిమిరపకాయలు - 2-4 
ఎండు మిరపకాయలు - 2 
నెయ్యి- 2 స్పూన్లు 
ఆవాలు - పావు స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
పెరుగు - 1- 1 1/2 కప్పులు 

చేసే విధానం : 


ముందు ఉసిరికాయలను చిన్నగా గాట్లు పెట్టుకొని ఒక బాణళిలో వేసి మగ్గపెట్టుకోవాలి. బాగా మగ్గాక అందులో గింజ తీసివేసి, ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

పచ్చిమిరపకాయలు కొత్తిమిరీ కలిపి కచ్చబచ్చాగా నూరుకోవాలి,ఆ ముద్దను ఉసిరికాయల ముద్దకు కలుపుకోవాలి. 

ఆ ముద్దలో కాస్త ఉప్పు కలుపుకొవాలి. తరవాత ఆవాలు, ఎండుమెరపకాయలు, ఇంగువ నెయ్యిలో వేయించి ఈ ముద్దలో వేసి పెరుగులో కలుపుకోవాలి. పైన కొత్తిమీరి జల్లుకొని అన్నములో తింటే చాలా బాగుంటుంది.

Thursday, August 9, 2012

పుదీనా దోశలు




కావాల్సినవి: 

పెసలు - 1 కప్ 
బియ్యము - 1/2 కప్ 
పుదినా - 1 కట్ట (పెద్దది) 
కొత్తిమీర - 1/2 కట్ట 
పచ్చిమిరపకాయలు - 4-6 
ఇంగువ - కొద్దిగా 
జీలకర్ర - 1 చెంచా 
ఉప్పు - రుచికి తగినంత 
వంటసోడా - ఒక చిటికెడు 

చేయు విధానము 


పెసలు, బియ్యము రెండు గంటలు నానబెట్టి అందులో పుదినా ఆకులు, కొత్తిమీర, పచ్చి మిరప కాయలు, ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకొని పక్కనపెట్టుకోవాలి. 

తరవాత అందులో తగినంత ఉప్పు, వంటసోడా, కొద్దిగా జీలకర్ర వేసి కలుపుకొని తవాపై పెసరట్టులా వేసుకోవాలి. దానిపైన ఇష్టమున్నవారు ఉల్లి పాయ చెక్కు, అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకోవచ్చు 

దీనికి కాంబినేషన్ కొబ్బరి చెట్నీ కాని అల్లం చెట్నీ  బాగుంటుంది

Wednesday, August 8, 2012

కోకోనట్ ఫ్రైడ్‌రైస్



కావలసినవి :

అన్నం- 3 కప్పులు 
కొబ్బరి తురుము - 1 కప్పు 
ఉల్లిపాయ -1 
కరివేపాకు - 2 రెమ్మలు 
పసుపు - చిటికెడు 
ఉప్పు - తగినంత 
నూనె - 4 టీ.స్పూ. 
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ స్పూన్లు 

పొడి చేయడానికి : 

ఎండుమిర్చి - 4 
జీలకర్ర - 1/2 టీ స్పూన్లు 
ధనియాలు - 2 టీ స్పూన్లు 
మిరియాలు - 1/2 టీ స్పూన్లు 
నువ్వులు - 2 టీ స్పూన్లు 

అన్నం పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముకోవాలి. బాణలి వేడి చేసి చెంచాడు నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, నువ్వులు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు వేసి కలిపి కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి తడి పోయేవరకు వేయించి తయారుచేసుకున్న మసాలాపొడి రెండు నిమిషాలు వేపి అన్నం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మరో రెండు నిమిషాలు వేయించి వేడిగా సర్వ్ చేయాలి. ఘాటైన కొబ్బరి అన్నం రెడీ.

Friday, August 3, 2012

రవ్వ ఇడ్లి


కావాల్సినవి : 

ఉప్మా రవ్వ - 1 కప్పు
పుల్ల పెరుగు - 1 కప్పు
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత
కొబ్బరి కోరు - రెండు స్పూన్లు
కారట్ - 1 స్పూన్
ఉల్లిపాయలు - 1 /2 కప్పు సన్నగా తరిగినవి
అల్లం - 1 స్పూన్ సన్నగా తరిగినవి
ఆవాలు, పచ్చి శెనగపప్పు : ఒక అర స్పూన్
నూనె : నాలుగు స్పూన్లు


తయారు చేసే విధానము :

ముందుగా బాండలిలో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి వేయించాలి.వేగిన ఉప్మా రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పుల్ల పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి.మామూలుగా తయారు చేసే ఇడ్లి పిండి లాగ తయారు చేసుకోవాలి.అందులో కారట్ తురుము, ఉల్లిపాయలు,కొబ్బరి కోరు, అల్లం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర గంట పాటు నాన పెట్టాలి.

ఇడ్లి పాత్రకి నూనె రాసి, వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడి / టమాటా పచ్చడితో కాని తింటే బావుంటుంది.

Wednesday, August 1, 2012

దొండపళ్ళ పచ్చడి



మనము దొండకాయ కూర చేసుకున్నప్పుడు కొన్ని సార్లు దొండపళ్ళు వస్తూవుంటాయి, చాలా మంది వాటిని పారేస్తారు.. ఒక సారి ఇలా చేసి చూడండి. 

దొండపళ్ళు : సన్నగా తరుకున్నవి 1 కప్పు 
టమాటాలు : 2 
ఎండుమెరపకాయలు : 5 
పచ్చిమిర్చి : 2 
కరివేపాకు: ఒక రెబ్బ 
మినపప్పు: అర స్పూన్ 
ఇంగువ : చిటికెడు 
మెంతులు : పావు స్పూన్ 
వెళ్ళుల్లి : 1-2 రెబ్బలు 
చింతపండురసం: 1-2 టేబుల్ స్పూన్లు 
నూని: 4 టేబుల్ స్పున్లు 
ఉప్పు: తగినంత 

చేసుకొనే విధానం: 

ముందుగా మూకుడిలో నూనె వేసుకొని అందులో మెరపకాయలు, ఇంగువ, మినపప్పు, మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. 
అందులోనే పచ్చి మిర్చి,టమాటముక్కలు, దొండపళ్ళ ముక్కలు వేసుకొని సన్నటి సెగమీద ఉంచి కాసేపు బాగా మగ్గనివ్వండి. 
తరవాత ఉప్పు, చింతపండురసం వేసి చల్లరాక వెళ్ళుల్లి , వేయించుకొన్న మెరపకాయలు,ఇంగువ వెసి రుబ్బుకోండి. పైన కరివేపాకు, మినపప్పు వేసుకోవాలి . 

అన్నముతో కాని దోసలతో కాని బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో...

దొండకాయ శనగల కూర




కావాల్సినవి పదార్ధాలు : 
దొండకాయలు - 1/4 కే.జీ 
శనగలు - అర కప్పు 
ఎండుమిరపకాయలు - 8 
ఉప్పు - తగినంత 
దనియాలు - 1 టి.స్పూను 
పచ్చికొబ్బరి తురుము - అర కప్పు 

చేసే పద్దతి: దొండకాయలను నాలుగు పీసులుగా నిలువు గా కట్ చేసుకోవాలి, 
ఎండుమిరప కాయలు, ఉప్పు, దనియాలు, పచ్చి కోబ్బరి వేసి మిక్సీకి ఆడించుకోవాలి.. 
శనగలను (నానబెట్టినవి)(మొలకెత్తినవైతె ఇంకా మంచిది)ముందుగా ఉప్పువేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.. 

ముందుగా దొండకాయలను ఆవిరికి ఉడికించుకోవాలి. 

పిదప బాణలిలో ఆయిల్ వేసి అందులో పోపు గింజలు వేసి...తరువాత శనగలు వేసి కొద్దిగా వేయించి దొండకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి..అందులోనికి ముందుగా చేసుకొని ఉంచుకున్న కారం ముద్ద వేసి బాగా కలిపి 2 నిముషాల తరువాత స్టవ్ కట్టేసి..పైన కొత్తిమీర చల్లాలి..

కాలి ఫ్లవర్ కాడల పచ్చడి


కావాల్సినవి :

కాలి ఫ్లవర్ కాడలు : ముక్కలు చేసుకొన్నవి ఒక చిన్న కప్పుడు 
2 చిన్న సైజు టమాటాలు 
ఒక స్పూన్ సెనగ పప్పు, మినపప్పు, ధనియాలు, 
2 పచ్చి మిర్చిలు, 2 ఎండు మెరపకాయలు 
కొట్టి మీరి తరిగింది ఒక స్పూన్ 
నుని - 4 స్పూన్ లు. 
చింతపండు రసం : 1 స్పూన్ 

ముందుగా మూకుడులో సెనగపప్పు, మినపప్పు మెరపకాయలు, ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. 
తరవాత అదే మూకుడులో పచ్చి మిర్చి వేయించి అందులో టమాట ముక్కలు, అవి కొద్దిగా వేగాక 
కాలి ఫ్లవర్ కాడలు వేసి కాస్త ఉప్పు వేసి పైన నీళ్ళ కంచం పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలి. 
బాగా మగ్గాక కొద్దిగా చింతపండు రసం వేసుకొని, కొట్టి మీరి తురిము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. 
చల్లారాక ఇవన్ని రుబ్బుకోండి, ఎవరికేనా వెల్లుల్లి ఇష్టపడేవారు 
రెండు లేక మూడు రబ్బల వెల్లుల్లి వేసుకొని రుబ్బుకొని వేడి వేడి అన్నం లో తింటే చాలా బాగుంటుంది.

బొబ్బర్ల దోసలు

కావాల్సినవి : 

బొబ్బర్లు : 1 కప్పు
శెనగపప్పు : 1/2 కప్పు
బియ్యం పిండి : 4 స్పూన్
పచ్చి మిర్చి : 5
అల్లం : ఒక 2 ఇంచులు
కొత్తిమీరి : 1/4 కట్ట
ఉప్పు తగినంత

ఒక రాత్రి బొబ్బర్లు నానపెట్టుకొని అందులోనే శెనగ పప్పు కూడా నానపెట్టుకొని , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీరి, ఉప్పు వేసుకొని , మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇంకో అరగంటలో దోసలు వేసుకుంటాము అనుకున్నప్పుడు బియ్యపుపిండి కలుపుకోవాలి.

దోసలా వెసుకొని పైన ఉల్లి చెక్కు వేసుకొని , కాస్త మిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని చేస్తే బాగుంటాయి. కొద్దిగా కంద అట్లలా ఉంటాయి.

జిలేబి

మైదా - 1 కప్ 
బియ్యప్పిండి - 3 స్పూన్స్ 
చెక్కర (బెల్లం కోరుకొన్నది) - 21/2 కప్ 
సోడ - చిటికెడు 
కేసర్ రంగు---చిటికెడు 
పుల్ల మజ్జిగ--1 కప్ 
నెయ్యి---2 కప్స్(వేయించడానికి) 

ఒక గిన్నెలోమైదా, బియ్యప్పిండి, సోడ, 
పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి. 
ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు చేసుకోవాలి) 

తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి. మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది. తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి. అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది.



తరువాత ఒక గిన్నెలో చెక్కర (బెల్లం) వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 
తరువాత వెడల్పాటి బానలి లో నెయ్యి వేసి, వేడి చేయాలి. తరువాత సాస్ బాటిల్లో తయారు చేసిన మైదా పిండిని వేయాలి.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి. 

ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి. 
ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి అర నిముషం పాటు ఉంచాలి. 
తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబికు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది.

గిన్ని రొట్టి (దిబ్బ రొట్టి )


మినపగుల్లు : ఒక గ్లాస్ 
వరి నూక : రెండు గ్లాస్ లు (లేని పక్షం లో ఉప్పుడు నూక ఉపయోగించుకోవచ్చు ) 
ఉప్పు తగినంతా 
రెండు పచ్చి మిర్చీలు (ఆప్షనల్), ఇంగువ 

పప్పు ఒక ఆరు గంటల పాటు నాన పెట్టుకొని, నూక ఒక గంట ముందు నాన పెట్టుకోవాలి. పిండిలో ఈ నూక కలుపుకొని ఒక నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి. పచ్చి మిర్చి ఇంగువ పిండిలో వేసుకోవాలి. ఒక ఇత్తడి గిన్ని వేడి చేసుకొని అందులో కాస్త నూని వేసుకొని, అది కాస్త వేడి అయ్యాక ఈ చోవి వేసుకొని బాగా కాల్చుకొని తినండి. దీనికి కొత్తావకాయ/తేనె పానకం కాబినేషన్ చాలా బాగుంటుంది.

మజ్జిగట్లు (చల్లట్లు)



కావాల్సినవి :

అటుకులు(/ మరమరాలు) : 1 కప్పు 
బియ్యం : 2 కప్పులు 
మెంతులు : 1 స్పూన్ . 
కొత్తిమీర (సన్నగా తరిగినది) : 1/4 కప్పు 
పచ్చి మిర్చి : 2 
పుల్ల పెరుగు : 1 కప్పు 
ఉప్పు : తగినంత 

ముందుగా బియ్యము, అటుకులు కడిగి, పుల్లటి పెరుగులో నానపెట్టాలి (7-10 గంటలు). తరువాత పచ్చి మిర్చి , కొత్తిమీరె వేసుకొని రుబ్బుకొని ఉప్పుకలుపుకొని ఇంకొద్దిసేపు అలానే ఉంచాలి (కనీసం 4 గంటలు). తరువాత తవా మీద నూనె వేసుకొని ఈ పిండి కొద్దిగా మందంగా వేసుకొని(ఊతప్పం లా) చుట్టు కొద్దిగా నూనె వేసుకొని పైన ఒక కంచం మూతపెట్టుకుని సన్నటి సెగమీద కాల్చుకోవాలి . 

అల్లపచ్చడి / పళ్ళీల పచ్చడి తో తింటే బాగుంటాయి. పైన ఉల్లి చెక్కు వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది .

వెజ్ నూడల్ ఫ్రైడ్ రైస్


కావలసినవి: 

కారట్ - పావు కప్పు
కాబేజీ - పావు కప్పు
కాప్సికం - పావు కప్పు
బేబి కార్న్ - పావు కప్పు
ఉల్లి కాడలు - కట్ చేసినవి - ఒక పావు కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద - 2స్పూన్లు
సోయా సాస్ - రెండు స్పూన్లు
రెడ్ చిల్లి సాస్ - రెండు స్పూన్లు
చిల్లి వెనిగర్ - ఒక స్పూన్

మొదట ఒక గ్లాస్ బియ్యం ఒక స్పూన్ నుని వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి, అలాగే ఒక కప్పు నూడిల్స్ కుడా నునే వేసుకొని ఉడికించుకొని మళ్లీ కాస్త ఒకటి రెండు స్పూన్ల నూని వేసుకొని పక్కన పెట్టుకోండి .
ఒక ముకుడిలో నునే వేసుకొని అందులో ఈ ముక్కలు అన్ని వేసుకొని సగం వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని తరవాత సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని అందులో అన్నం, నూడిల్స్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే వేడిగా ఒక ప్లేట్ లో వేసుకొని తింటే.. చాలా బాగుంటుంది. ట్రై చేసి చేసి చూడండి.

గుత్తి వంకాయ కూర



కావల్సినవి:

వంకాయలు చిన్నవి - అర కిలో
శనగ పప్పు - ఒక కప్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురిమినది - అర కప్
ఎండు మిర్చి - తగినంత
ఆవాలు, జీలకర్ర పోపుకు సరిపోయే అన్ని
పసుపు
ఉప్పు తగినంత
నూనె _ అర కప్పు 


ముందుగా శనగ పప్పు, ధనియాలు, మిరపకాయలు (నూనె లేకుండా) వేయించి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వంకాయలు కడిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగ సిద్ధం చేసుకున్న పొడిని, కొబ్బరి తురుమును కలిపి వంకాయలలో కూర్చాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, వేసుకొని కొంచం వేగిన తర్వాత కూర్చిన వంకాయలు కూడా వేసి మూత పెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ.

Tuesday, July 31, 2012

వంకాయ ఉల్లికారం


వంకాయలు : ఐదు 
ఉల్లిపాయలు : రెండు 
టమాటాలు : రెండు ( వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతె లేదు) 
వెల్లుల్లి రాబ్బలు : నాలుగు 
ధనియాలు, జీరకర్ర : రెండు స్పూన్లు 
నూని : ఒక చిన్న కప్పు 
పసుపు చిటికెడు 
ఉప్పు తగినంత 
ఎందు మెరపకాయలు : పది 

ముందుగా మూకుడులో ధనియాలు జీరకర్ర వేసుకొని కొంచం వేగాక పక్కన పెట్టుకోవాలి, అందులో కాస్త నూని వేసి మెరపకాయలు వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకొని, ఆ ముకుడులోనే కాస్త నూని వేసి అందులో ఉల్లిపాయలు, టమాటాలు, దోరగా వేగనివ్వాలి, అందులోనే వేల్లుల్లిరబ్బలు వేసుకోవాలి. ఇవన్నిటిని కాస్త పసుపు ఉప్పు వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత ఆ గిన్నేలోనే కాస్త నూని వేసి వంకాయలని వేగనివ్వాలి. కాస్త వేగాక అందులో ఈ ఉల్లిముద్ద ని కూరి మళ్ళి వేగనివ్వాలి. ఇలా ఒక ఐదు, పది నిమిషాలు వేగాక చివర్లో కాస్త కొత్తిమీరి చల్లుకొని అన్నలో కలుపుకొని తింటే బాగుంటుంది.

బీన్స్ కొబ్బరి కూర



కావల్సినవి: 

బీన్స్ 1/4 కే.జి 
కొబ్బరి తురుము 1/2 కప్పు 
ఆవాలు 1/2 స్పూన్ 
మినపప్పు 1/2 స్పూన్ 
జీలకర్ర 1/2 స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
ఎండుమిరపకాయ - 2 
కరివేపాకు - 2 రబ్బలు 
నూనె 2స్పూన్ 
ఉప్పు తగినంత 

బీన్స్ సన్నగా తరిగి ఉడికించు కోవాలి. 
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడేకా ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా కొబ్బరి తురుము వేసి వేయించాలి. 
కొబ్బరి వేగాక ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి.

గుత్తివంకాయ కూర



గుత్తివంకాయ కూర (Tomato):

వంకాయలు- ఐదు,
టమాటాలు- మూడు, 
నువ్వులు- అరచెంచా,
ఎండుకొబ్బరి తురుము- అరకప్పు,
వేరుసెనగపప్పు- పావుకప్పు,
ఎండుమిర్చి- నాలుగు,
రసంపొడి- చెంచా,
చింతపండు గుజ్జు - కొద్దిగా,
ఉప్పు- రుచికి తగినంత, నూనె- మూడు చెంచాలు, తాలింపు దినుసులు- చెంచా, బెల్లం తురుము- పావుకప్పు, పసుపు- పావుచెంచా, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర తురుము - కొద్దిగా

తయారీ:
బాణలిలో అరచెంచా నూనె వేసి వేరు సెనగపప్పు, నువ్వులు, కొబ్బరి తురుము వేయించి పెట్టుకోవాలి. టమాటా, బెల్లం తురుము, ఉప్పు మిక్సీలో వేసి గుజ్జులా చేసి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న వేరుసెనగపప్పు, కొబ్బరి తురుము, నువ్వుల్ని కూడా పొడిలా చేసి టమాటా గుజ్జుకు కలపాలి. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి నాలుగు భాగాలుగా కోసి సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వాటిల్లో కూరాలి. వెడల్పాటి పాన్‌ తీసుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేయించి పసుపు, ఇంగువ వేయాలి. ఆ తరవాత వంకాయలు, చింతపండు గుజ్జు, రసంపొడి ఒకదాని తరవాత ఒకటి చేర్చి మూత పెట్టేయాలి. వంకాయలు బాగా మగ్గాక మంట తగ్గించి, మిగిలిన టమాటా మిశ్రమం కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లితే చాలు.. కమ్మని టమాటా గుత్తి వంకాయ కూర సిద్ధం.

బీరకాయ నువ్వుల గుండ



కావలసిన పదార్థాలు
బీరకాయ:పావు కిలో(చిన్న ముక్కలుగా తరిగినవి)
ఉప్పు:తగినంత
పసుపు:చిటికెడు
నూనె: 2 టీస్పూ
నువ్వుల పొడి: అర కప్పు
పోపు: ఆవాలు, జీలకర్ర, ఎండు మిరప కాయలు, కరివేపాకు


తెల్లనువ్వులు:పావు కప్పు
ఎండు మిరపకాయలు: 5-7
ముందుగా ఒక బాణెలి లో తెల్లనువ్వులు, మిరపకాయలు వేసి చిన్న మంటపై వేయించుకోవాలి.
నువ్వులపప్పు కొంచెం ఎర్రగ అయిపోగానే స్టవ్ మీదనించి తీసివేయాలి. బాగా చల్లరాక మెత్తగ పొడి చేసుకోవాలి.
ఈ పొడి కొద్ది రోజులు నిలవ వుంటుంది. వేడి మీద పొడిచేస్తే నువ్వుల పప్పు పొడి అవదు. ముద్ద అవుతుంది.

బాణెలి లో నూనె వేసి పోపు వేసుకుని, వేగాక కూరముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గనివ్వలి.కూర ముక్కలు మగ్గి నీరు తగ్గిన తరువాత నువ్వుల పొడి వేసుకోవాలి.

అంతే కూర తయారు.ఇలాగే సొరకాయ, పొట్లకాయ, గోరుచిక్కుడు కూడా చేసుకోవచ్చు, గోరుచిక్కుడు కూరకైతే ముక్కలు ముందుగా ఉండికించుకోవాలి.

మొలకెత్తిన పెసల కూర



కావలసిన పదార్థాలు :


మొలకెత్తిన పెసలు - 1 కప్పు
టొమేటోలు - 4
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 కట్ట
నూనె, ఉప్పు - తగినంత
జీలకర్ర - 1/2 టీస్పూన్‌
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 టీస్పూన్స్‌
ఉల్లిపాయలు - 2
క్యారెట్‌, క్యాప్సికమ్‌ తరుగు - 1/2 కప్పు

తయారు చేసే విధానం :

ముందుగా మొలకెత్తిన పెసలను ఉడికించి, వడగట్టి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. అందులోనే పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాప్సికమ్‌ తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి దొరగా వేయించాలి. వేయించాక అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, టొమేటో ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఉడికించిన పెసల్ని వేసి కలిపి, ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి, చివర్లో కొత్తిమీర చల్లి దించాలి. అంతే ఇది అన్నంలోకైనా, బ్రెడ్‌ ముక్కల మధ్యలో ఉంచి సాండ్విచ్‌లాగా తినడానికైనా, రోటిలోకైనా బాగుంటుంది.

సగ్గుబియ్యం వడ

  


కావలసినవి : 

సగ్గుబియ్యం: 1 కప్పు 
బంగాళాదుంప: ఒకటి 
బియ్యప్పిండి: 5 స్పూన్లు 
ఉల్లిపాయ: ఒకటి 
అల్లం: ఒక ఇంచ్ 
పచ్చిమిర్చి: 3-5 
మజ్జిగ: సగం కప్పు 
నూనె: వేయించడానికి సరిపడా 
ఉప్పు: సరిపడ 

తయారుచేసే విధానం 

సగ్గుబియ్యం, మజ్జిగలో గంటసేపు నాననివ్వాలి. 
ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. 
బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి 

ఇప్పుడు సగ్గుబియ్యం, చిదిమిన బంగాళాదుంప, ఉల్లిపాయముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు అన్నీ వేసి కలపాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి.

Monday, July 30, 2012

పనసపొట్టు కూర



కావలసిన పదార్థాలు: 

పనసపొట్టు - 2 కప్పులు, 
ఎండుమిర్చి -5, 
ఇంగువ - 2-3 చిటికెలు 
ఆవాలు - 2-3 టీ స్పూన్లు, 
అల్లం ముక్క - ఒక ఇంచ్ 
మినప్పప్పు - 2 టీ స్పూన్లు, 
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్లు, 
కరివేపాకు - 4 రెబ్బలు, 
చింతపండు రసం - 2-3 స్పూన్లు 
పసుపు - అర టీ స్పూను, 
ఉప్పు - రుచికి తగినంత, 
నూనె - 2 టేబుల్ స్పూన్లు 
చిట్టొడియాలు (మినప వడియాలు చిన్నవి)- 6-10 వరకు 

తయారుచేసే విధానం: 

పనసపొట్టుని మూడొంతులు నీరున్న పెద్ద పాత్రలో వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి. 
ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి. 

ఎండుమిరపకాయలను (3 లేక 4), ఆవాలను కాసేపు నీళ్ళల్లో నానపెట్టుకొని, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. 

తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేగాక ఉడికించిన పనసపొట్టుని కలపాలి. సన్నని సెగమీద నీరంతా ఇగిరిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకోవాలి. 
తరవాత ఆవముద్ద కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, మూత పెట్టుకోవాలి. తినే ముందు వేయించిన చిట్టొడియాలు కలుపుకొని తింటే బాగుంటుంది.( పోపు వేగినతరవాత కాస్త పోపు తీసుకొని తినేముందు కలుపుకొని తింటే కటకట పోపుతో కూర చాలా బాగుంటుంది. కొంత మంది పోపులో పళ్ళీలు కూడా వేసుకుంటారు.)

Saturday, July 28, 2012

కందా బచ్చలి కూర

కావలసినవి: 

కంద ఒక చిన్న ముక్క ( అర కే.జి) 
బచ్చలి రెండు కట్టలు( బచ్చలి ఎక్కువ వేస్తే జారుగా ఉంటుంది కూర) 
చింతపండు రసం నాలుగు- ఐదు చెంచాలు 
ఉప్పు తగినంత 
నూనే 2 - 3 స్పూన్లు 
పోపుకి: 
ఆవాలు 1/2 స్పూను 
మినపప్పు 1 స్పూను 
సెనగపప్పు 2 స్పూను 
ఎండు మిరపకాయ 4 
కరివేపాకు పోపుకి తగినంత 
సన్నగా తరిగిన పచ్చిమిరప కాయలు 8 - 10 
సన్నగా తరిగిన అల్లం 1 అంగుళం 

ఆవకి: 
ఆవాలు 4 స్పూన్లు 


తయారీ విధానం: 
కందని చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి బాణలిలో వేసి ఉడికించు కోవాలి. కంద కాస్త మెత్తగా ఉడికాక సన్నగా తరిగిన బచ్చలి కూడా కందతో పాటు ఉడకనివ్వాలి. బచ్చలి కూడా మెత్తబడ్డాక( ఉడుకుతూ ఉండగానే) చింతపండు రసం, తగినంత ఉప్పు,మరి కాసేపు(ఒక 5 నిముషాలు) ఉడకనివ్వాలి. ఇప్పుడు నీటిని వడబోసి కందబచ్చలి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 

బాణలిలో 2 స్పూన్లు నూనే వేసి పోపు సామగ్రి వెయ్యాలి, అవి కాస్త చిటపటలాడాకా కంద బచ్చలి మిశ్రమాన్ని వేసి కాస్త మగ్గనివ్వాలి. గరిటతో చిదమి కూర కాస్త ముద్ద గా చేసుకోవాలి.. 

ఆవ ముద్ద( ఆవ, అల్లం, పచ్చి మిర్చి, ఒక ఎండు మెరపకాయ, ఇంగువ ) చేసుకొని ఉడికించుకొన్న కూర వేసుకోని మూత పెట్టుకొని ఒక్క నిముషం చిన్న మంట మీద మళ్ళీ ఉంచుకోవాలి. 
అంతే కందా బచ్చలి కూర రెడీ

పెసరపునుగులు



పెసరగుల్లు : ఒక కప్పు 
ఉల్లిపాయ పెద్దది 1 
పచ్చిమిర్చి 4 - 8 
కొత్తిమీర 
అల్లం - ఒక ఇంచు 
ఉప్పు తగినంత 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడ్డా 

పెసర గుళ్ళు ( పెసర పప్పు అయినా పర్వాలేదు) ఒక రెండు గంటలు నాన పెట్టుకోవాలి. అలా నాన పెట్టిన పెసలు రుబ్బుకొని( మరీ మెత్తగా వద్దు) అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ చెక్కు, పచ్చి మిర్చి అల్లం ముద్ద, కొతి మీర , తగినంత ఉప్పు వేసుకొని, అవి చిన్న చిన్న ఉండల లాగా నూనె లో వేసుకొని వేయించుకోవాలి. ఒక 3-5 నిమిషాలు వేగితే చాలు. వేడిగా టమాట పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.

Wednesday, July 25, 2012

కొట్టక్క బుట్ట



కావల్సినవి : 

రెండు కప్పుల మినపగుళ్ళు 
నాలుగు కప్పుల వరి నూక 
ఉప్పు తగినంత 

మినపగుళ్ళు ఒక ఆరుగంటల పాటు నానపెట్టుకొని మెత్తగా రుబ్బుకొని నాన పెట్టిన వరినూక, ఉప్పు(కావల్సిన వారు పచ్చి మిర్చి అల్లం ముక్కలు వేసుకోవచ్చు) కలుపుకొని ఒక ఆరు గంటల పాటు నాన నివ్వాలి 
పనసాకులు ఒక బుట్టగా కుట్టుకొని అందులో ఈ పిండి పోసుకొని పెద్ద గిన్నెలో నీరు పోసుకొని అందులో ఒక ప్లేట్లో వీటిని ఆవిరిపెట్టాలి. ఒక పది నిమిషాల తరవాత బాగా ఉడికిన కొట్టక్క బుట్టలు రెడి. వీటిని ఆవకాయతో కాని శెనగ పచ్చడితో కాని తింటే బాగుంటుంది.

బీన్స్ కొబ్బరికోరు కూర



కావల్సినవి : 

బీన్స్ - పావు కే.జి. 
కొబ్బరి తురుము - 1 కప్పు 
ఆవాలు - 1/2 త్స్ప్ 
శెనగపప్పు - 1/2 స్పూన్ 
మినపప్పు 1/2 స్పూన్ 
జీలకర్ర 1/2 స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
ఎండుమిరపకాయ - 3 
కరివేపాకు - 4 రెబ్బలు 
నూనె 2-3 స్పూన్లు 
ఉప్పు తగినంత 

బీన్స్ సన్నగా తరిగి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడాక ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగాక అప్పుడు కొబ్బరి కోరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి, ఆ వేడికే కొబ్బరి ఉడుకుతుంది. కొబ్బరి వేగితే వాసన బాగోదు.

అటుకుల ఉప్మా

కావల్సినవి : 

అటుకులు--3 కప్స్ 
ఉల్లిపాయ--1 
టమొటా--1 
అల్లం--చిన్న ముక్క 
పచ్చి మిర్చి--3 లేక 5 
నూనె--1 స్పూన్ 
నెయ్యి--1 స్పూన్ 
కరివేపాకు--1 రెమ్మ 
కొత్తిమీర--2 రెమ్మలు 
పసుపు--1/2 స్పూన్ 
శనగ పప్పు, మినపప్పు ,జీలకర్ర,ఆవాలు - 1 స్పూన్ 

విధానము: 
1.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి. 

2.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, పోపు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి. 

3.తరువాత పసుపు, కరివేపాకు వేయాలి.తగినంత ఉప్పు వేయాలి. 

4.అటుకులు నీళ్ళలో కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి, పక్కన పెట్టుకోవాలి. 

6.తరువాత వేయించిన ఉల్లిపాయ మిశ్రమము లో గట్టిగా పిండి, పక్కన పెట్టుకున్న అటుకులను వేసి బాగా కలిపి 2 నిముషాలు మూత పెట్టాలి. 

అంతే ముగ్గురికి సరిపడ అటుకులుప్మా తయారు. 

పైన కొత్తిమీర వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. కొందరు ఈ ఉప్మాలో ఉడికించిన ఆలు, బీన్స్, బఠానీలు , కారట్టు ముక్కలు వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది.